PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతులు ప్రధానం

1 min read

– అందజేసిన రామ్ సైడ్స్ క్రాఫ్ సైన్స్ లిమిటెడ్

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా , రైతులకు సేవ చేస్తున్న రామ్‌సైడ్స్ క్రాప్‌సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని ఓబులంపల్లె ఎంపీయుపి విద్యార్థులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు, ఈ సందర్భంగా రామ్ సైడ్స్ క్రాఫ్ట్ సైన్స్ సంస్థ వారు విద్యార్థులకు  భారత స్వాతంత్ర్య పోరాటం ఎలా జరిగింది, స్వతంత్ర ఉద్యమ సమరయోధుల త్యాగాలు వంటి వాటిపై అవగాహన కల్పించడం జరిగింది, అలాగే , రామ్ సైడ్స్ క్రాప్ సైన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీని నిర్వహించి  విజేత లైన విద్యార్థులకు బహుమతులు కంపెనీ ఎండి( మేనేజింగ్ డైరెక్టర్ R పద్మనాభన్  చేసిన  సర్టిఫికేట్‌లను  అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ప్రవీణ్, ఏరియా మేనేజర్ నరసింహారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖాజా హుస్సేన్,  సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జి, సుబ్బరాయుడు, సేల్స్ ఆఫీసర్ రఘునాథ రెడ్డి ఉపాధ్యాయులు ఖదీర్ భాష, వెంకట శ్రీనివాసులు, ఎల్లేశ్వ రరావు, రాజశేఖర్, శ్రీనివాసమూర్తి, సుజాత గ్రామ పెద్దలు పట్టాభి రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి  మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author