PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..

1 min read

ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

  • దిబ్బనకల్లు,సలకలకొండలో విస్తృత ప్రచారం

ఆదోని, పల్లెవెలుగు:అభివృద్ధిలో ఆదోనిని జిల్లాలోనే మోడల్​ పట్టణంగా తీర్చిదిద్దుతానని, ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. సోమవారం మండలంలోని దిబ్బనకల్లు,సలకలకొండ గ్రామాల్లో కూటమి నాయకులు విస్తృత ప్రచారం చేశారు.  ఆయా గ్రామాల్లో డా. పార్థసారధి మాట్లాడుతూ  గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఒక్క  అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మాట్లాడుతూ వైద్యరంగంలో విజయవంతంగా రాణిస్తున్న డా. పార్థసారధిని ఆశీర్వదిస్తే….. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని పిలుపునిచ్చారు. ప్రజలు ఆలోచించి… కూటమి అభ్యర్థి డా. పార్థసారధి పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆ తరువాత జనసేన నియోజకవర్గ ఇన్​చార్జ్​ మల్లప్ప మాట్లాడుతూ అణగారిన వర్గాలైన బీసీ ఎస్సీఎస్టీలు, ముస్లింల అభ్యన్నతికి  కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే… డా. పార్థసారధిని గెలిపించాలని కోరారు.  అంతకు ముందు ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ… విస్తృత ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీజేపీ,జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

About Author