PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రుక్కెడు త్రాగునీరు అందించండి మహాప్రభో

1 min read

– కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోని అధికారులు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలంలోని నూజివీడు గ్రామంలో ఉన్న పెద్ద హరిజనవాడ ప్రజలు త్రాగునీరు అందించండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు. ఎన్నిసార్లు కార్యాలయాలు చుట్టూ తిరిగిన అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని తమ గోడు ఎవరికి విన్నవించుకోవాలో దిక్కు తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. .అసలే వేసవికాలం కావడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు. తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా తమ గోడు ఆలకించి తమకు త్రాగునీరుఅందించుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు .తమ కుటుంబాలలో పాఠశాలలకు వెళ్లే పిల్లలు తమ పిల్లలు స్నానానికి కూడా నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జిల్లాస్థాయి అధికారులు తమ ఊరుని సందర్శించి పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు.

About Author