NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒక చేత్తో ఇస్తూ.. మ‌రో చేత్తో గుంజుకుంటున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజా పంచాంగంలో ఆర్ధిక సంక్షోభం ఖాయంగా కనిపిస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకుంటున్నారని విమర్శించారు. కరోనాతో ఆర్ధికంగా కుదేలైన ప్రజానీకాన్ని జగన్ రెడ్డి ఆస్తిపన్ను, మరుగుదొడ్డి పన్ను, చెత్తపన్ను, విద్యుత్ ఛార్జీల బాదుడుతో దివాలా తీయించారని విమర్శించారు. జే-బ్రాండ్లతో జనం జేబులకు చిల్లు పెట్టారని, లూఠీ కోసం చేసిన అప్పులతో రాష్ట్రం అస్తవ్యస్తమైందన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి పంచాయతీల నిధులు దారిమళ్లిస్తోందని ఆరోపించారు.

                              

About Author