PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా అక్కమహాదేవి జయంతి

1 min read

శ్రీశైలం: శ్రీశైల మల్లికార్జునస్వామివారి పరమ భక్తులలో ఒకరైన శివశరణి అక్కమహాదేవి వారి జయంత్యోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.  తెల్లవారు జామున ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి వారికి పంచామృత అభిషేకం, జలాభిషేకం తదితర విశేషపూజలు జరిపించబడ్డాయి. ఈ కార్యక్రమంలో లో ఈఓ లవన్న  ధర్మకర్తలమండలి సభ్యులు శ్రీమతి జి.ఎమ్. విజయలక్ష్మీసుబ్బరాయుడు, శ్రీ ఎ. మురళి, స్వామివారి ప్రధానార్చకులు. జె. వీరభద్రయ్యస్వామి, ఉపప్రధానార్చకులు ఎం. వీరయ్యస్వామి, ఆలయసహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

About Author