PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవంగా..రథసప్తమి వేడుకలు

1 min read

సూర్య భగవానుడిని దర్శించుకున్న  వేలాది భక్తులు..

పల్లెవెలుగు వెబ్​ : కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలోని బాలాజీ నగర్ లో ఉన్న శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీసులతో శ్రీ సూర్య నారాయణ స్వామి దేవస్థానంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం మంగళ హారతితో ప్రారంభమైన పూజలు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ సాయంత్రం పూజలు తదితర వేడుకలతో కనుల పండుగగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎం.ఎల్.ఏ. ఎస్.వి.మోహన్ రెడ్డి వారి సతీమణి ఎస్.విజయమ్మ తో కలసి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.వి.మోహన్ రెడ్డి మాట్లాడుతూ రథ సప్తమి అంటే సూర్య భగవంతుడిని అత్యంత వైభవంగా ఆరాధించే రోజని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య నారాయణ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author