PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవం… జ్వాలాతోరణోత్సవం..

1 min read

పల్లెవెలుగు, మహానంది:నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి దంపతులతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా కార్తీక పౌర్ణమి సందర్భంగా క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం సాయంత్రం జ్వాలాతోరణ కార్యక్రమాన్ని ఆశేష భక్త జనవాహిని మధ్య వేద మంత్రో చరణాలు మంగళ వాయిద్యాల మధ్య వేద పండితులు రవి శంకర్ అవదాని నాగేశ్వర శర్మ శాంతారామ్ భట్ ఆధ్వర్యంలో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు ముఖ్యంగా మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ధ్వీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఎన్నడూ లేని విధంగా వాహనాలు ఆలయ ప్రాంగణం మరియు గరుడ నంది ఆలయం వరకు నిలుపుదల చేసి ఉంచడం విశేషం.

About Author