PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవం.. సూర్యదేవాలయం తృతీయ వార్షికోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్​ బంకు వద్ద ఉన్న శ్రీ సూర్య నారాయణ స్వామి దేవస్థానం తృతీయ వార్షికోత్సవం వేడుకలు భక్తిశ్రద్ధలతో.. అంగరంగ వైభవంగా జరుగుతోంది.  మంగళవారం రథసప్తమి సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. దేవస్థానం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలంకరణతో అందంగా తీర్చిదిద్దారు. సోమవారం ఉదయం  సూర్య ఆరాధన, అభిషేకం, అరుణహోమం తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు , అర్చనలు చేయించారు. భక్తులకు దేవస్థానం అర్చకులు తీర్థ ప్రసాదం వితరణ చేశారు.

About Author