NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటింటికి వెళ్లి గృహాలపై అవగాహన

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండలంలోని కడుమూరు,49బన్నూరు గ్రామాలలో ఉన్న గృహ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి బేస్మెంట్ మరియు ఇతర స్టేజ్ లలో ఉన్న ఇండ్లు త్వర త్వరగా పూర్తి చేయాలని గృహాల లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి అవగాహన కల్పించారు.కడుమూరు గ్రామంలో గృహ నిర్మాణ శాఖ ఇంచార్జి అసిస్టెంట్ ఇంజనీర్ జె రమేష్ మరియు పంచాయతీ కార్యదర్శి బి.శివకళ్యాణ్ సింగ్,వీఆర్వో బాలన్న,49 బన్నూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి బీజాన్ బి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ చరణ్ లబ్ధిదారులు ఉగాది పండుగలోపు ఇండ్లు పూర్తి చేయాలని ఏమైనా ఆర్థికపరంగా అవసరం ఉంటే పొదుపు సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తామని వారు లబ్ధిదారులకు తెలియజేశారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉగాది రోజున ఇండ్లను ప్రారంభించాలనే లక్ష్యం ఉండడం పట్ల వారు గ్రామాల్లో తిరిగారు.ఈకార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author