PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆప్ఘనిస్థాన్ వెళ్లి పెట్రోల్ పోయించుకో.. !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పెట్రోల్ ధ‌ర‌ల పెంపు పై ప్రశ్నించిన ఓ జ‌ర్నలిస్టుకు మ‌ధ్యప్ర‌దేశ్ కు చెందిన బీజేపీ నేత షాకింగ్ స‌మాధానం ఇచ్చారు. క‌ట్ని జిల్లా నేత రామ్ ర‌త‌న్ పాయ‌ల్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్రోల్ , నిత్యవ‌స‌ర ధ‌ర‌ల పెరుగుద‌ల గురించి ప్రశ్నించిన ఓ జ‌ర్నలిస్టు పై రామ్ ర‌త‌న్ పాయ‌ల్ విరుచుకుప‌డ్డారు. ‘ ఆప్ఘానిస్థాన్ వెళ్లు.. అక్కడ పెట్రోల్ లీట‌ర్ 50 రూపాయ‌ల‌కే దొరుకుతుంది. వెళ్లి అక్కడ పోయించుకుని రా. అక్కడ ఎవ‌రూ పోయించుకోవ‌డం లేదు. ఇక్కడైతే క‌నీసం పెట్రోల్ పోయించుకునే స్వేచ్చ ఉంది‘ అంటూ చుర‌క‌లు అంటించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

About Author