PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అండ‌ర్ వేర్ కొన‌డానికి ఢిల్లీ వెళ్లా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ గత వారం పెద్ద రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన బలపరీక్షను కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సొరేన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు మరో చిక్కును తెచ్చిపెట్టాయి. తాజాగా ఆయన ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఇద్దరు అమ్మాలను అత్యాచారం చేసి, చంపేసిన ఘటన ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దుమ్కా నియోజకవర్గాన్ని అట్టుడికేలా చేస్తోంది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన బసంత్ సొరేన్… హత్యాచారానికి గురైన బాలికల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా… అండర్ వేర్ లు కొనుక్కోవడానికి వెళ్లానని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి తెచ్చుకున్నానని చెప్పారు.

                                          

About Author