PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూనియ‌న్ బ్యాంక్ లో గోల్ మాల్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం యూనియన్(ఆంధ్రా బ్యాంక్) బ్యాంకులో భారీ గోల్ మాల్ జరిగింది. రైతులకు చెందిన సుమారు రూ.50 లక్షల నగదును బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఉండవల్లి రవి గోల్ మాల్ చేశాడు. రవి గత 20 సంవత్సరాలుగా బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రైతులకు చెందిన నగదు వారి అకౌంట్‌లలో జమ కాకపోవడంతో బాగోతం బయటపడింది. దీనిపై బ్యాంక్ ఉద్యోగులను రైతులు, స్థానికులు నిలదీశారు. అయితే రవితో తమకు సంబంధం లేదని బ్యాంక్ ఉద్యోగులు తెలిపారు. కాగా బ్యాంక్ మేనేజర్ పింటు కుమార్ వారం రోజులుగా సెలవులో ఉన్నారు. ఈ వ్యవహారం బయటపడటంతో బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఉండవల్లి రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గోల్‌మాల్‌కు సంబంధించి బ్యాంక్ అధికారులు ఇంత వరకు రవిపై ఫిర్యాదు చేయని పరిస్థితి. దీంతో రైతులు బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు.

                                           

About Author