PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తిరుప‌తిలో గోల్ మాల్.. ప్ర‌సాదంలో నాణ్య‌తా లోపం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే ముడిసరుకుల గోల్‌మాల్ వ్యవహారం వెలుగుచూసింది. ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి పదే పదే ఫిర్యాదులు అందడంతో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడయింది. ఈ మధ్య కాలంలో లడ్డూ ప్రసాదాల నాణ్యతపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ముడిసరుకుల కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లడ్డూల్లో వాడే జీడిపప్పు నాసిరకంగా ఉంటోందని పలు ఫిర్యాదులందాయి. భక్తుల ఫిర్యాదుతో టీటీడీ ఛైర్మన్ మార్కెటింగ్ గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడిపప్పు నాణ్యత బాగోలేదని ఆయన తెలుసుకున్నారు. వెంటనే జీడిపప్పు కాంట్రాక్టు రద్దు చేయాలని ఆదేశాలిచ్చారు. లడ్డూ తయారీలో ఉపయోగించే యాలకులు, నెయ్యి నాణ్యత కూడా సరిగా లేకపోవడంతో వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

                               

About Author