PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు చేసినప్పుడే భగవంతుడు కరుణిస్తాడు

1 min read

– రాజంపేట నియోజకవర్గం వైసీపీ నేత విజయసాగర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ వైసీపీ నేత విజయసాగర్ రెడ్డి శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు రామాలయాలలో పూజలు నిర్వహించి ప్రజల క్షేమంకోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసినప్పుడే భగవంతుడు కరుణిస్తాడని తెలియజేశారు.అనంతరం రాయచోటి కడప హైవేలో టోల్ ప్లాజా దగ్గర గల అభయ హస్త ఆంజనేయస్వామి ఆలయం లో సీతారాముల కళ్యాణోత్సవం లో పాల్గొన్నారు. అలాగే వీరబల్లె మండలం గడికోట గ్రామ పంచాయతీ యడబల్లె లో గల సీతారాముల ఆలయంలో పూజలు చేసి ప్రజలకోసం ప్రార్థన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author