PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోదాగోకులంలో గోకులాష్టమి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని శ్రీగోదాగోకులం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, శ్రీ గోదా గోకులం వ్యవస్థాపకులు, తితిదే ధర్మప్రచార మండలి సభ్యులు మారం నాగరాజు గుప్త, గోదాగోకులం ట్రష్టీ పల్లెర్ల నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తిరుమంజనం, విశేషాలంకరణ, అర్చన,వివిధ భజన బృందాలచే శ్రీకృష్ణ భజనలు, గోపూజ , నివేదన, ప్రసాద వితరణ, సాయంత్రం శ్రీగోదాగోపిక శ్రీకృష్ణుల పల్లకి ఊరేగింపు, గోపికలు, గోపబాలురచే ఉట్టి కొట్టే కార్యక్రమం, ఊంజల సేవ, పవళింపు సేవ, తీర్థప్రసాద గోష్ఠి మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మప్రచార మండలి సభ్యులు బిర్రు ప్రతాప్ రెడ్డి, ఎద్దుల మహేశ్వర రెడ్డి, ఎన్ . శ్రీనివాసులు రెడ్డి, అనంత అనిల్ కుమార్, పసుపులేటి నీలిమ, విశ్రాంత ఔషధ నియంత్రణాధికారి డాక్టర్ తల్లం నాగనారాయణ రావు, గోదాగోకులం పరివారం జనార్థన్, పాలాది సుబ్రహ్మణ్యం, బాలసుధాకర్, ఇటిక్యాల పుల్లయ్య, తలుపుల శ్రీనాథ్, మాకం శ్రీనివాసులు, ఉమామహేశ్వరరెడ్డి, చిత్రాల వీరయ్య, అర్చకులు రమేషాచార్యులు, శేషాచార్యులుతో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author