PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థుల బంగారు భవిష్యత్​కు…‘జెనిత్​’ భరోసా

1 min read

ఉత్తమ కోచింగ్​తో..నవోదయ, సైనిక్​ స్కూల్​, రాష్ర్టీయ మిలిటరీ, గురుకులకు ఎంపిక

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు:పిల్లల బంగారు భవిష్యత్​కు భరోసా ఇస్తూ… అత్యుత్తమ క్రమశిక్షణ గల విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తోంది జెనిత్​ కోచింగ్​ సెంటర్​. విశాలమైన భవనంలో ఆధునిక టెక్నాలజీ…అనుభవం గల లెక్చరర్లతో నవోదయ, సైనిక్​ స్కూల్​, రాష్ట్రీయ మిలిటరీ, గురుకుల పాఠశాలకు ఎంపిక అయ్యేలా కోచింగ్​ ఇస్తున్నారు. కార్పొరేట్​..ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా కోచింగ్​ సెంటర్​లో మెళకువలు నేర్పుతూ… విద్యార్థుల బంగారు భవిష్యత్​కు బాటలు వేస్తున్నారు. రాయలసీమ యూనివర్శిటీకి అతి సమీపంలో ఉన్న జెనిత్​ కోచింగ్​ సెంటర్ ను చైర్మన్​ ఎన్​వి ఖాన్​, డైరెక్టర్​ బి. సతీష్​ నేతృత్వంలో కొనసాగుతోంది. బాలబాలికలకు ప్రత్యేక హాస్టల్​, భోజన వసతి ఉంది.

సులభ పద్ధతిలో.. బోధన..:

నవోదయ, సైనిక్​, గురుకుల, రాష్ట్రీయ మిలిటరీ స్కూళ్లలో సీటు పొందేందుకు పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సులభమైన పద్ధతి ద్వారా విద్యార్థులకు అర్థమయ్యేలా శిక్షణ ఇస్తూ… ప్రశ్నలకు శరవేగంగా సమాధానం చెప్పేలా.. రాసేలా తీర్చిదిద్దుతున్నారు.  ప్రతిభావంతులైన టీచర్ల ద్వారా ఇంగ్లీష్​ మీడియంలో   కంప్యూటర్లు,ల్యాప్​టాబ్​స, డిజిటల్​ క్లాసుల సహాయంతో పాఠాలు బోధిస్తున్నారు. నవోదయ, సైనిక్​ స్కూల్​, ఏపీ టీఎస్​ గురుకుల పాఠశాలలకు, ఎన్డీఏ, సీడీఎస్​ మరియు పారామిలిటరీలో ప్రవేశ పరీక్ష కొరకు శిక్షణ ఇస్తున్నారు.  శిక్షణలో భాగంగా ధ్యానం, యోగా, దేహదారుఢ్య శిక్షణ ఇస్తున్నారు.

నవోదయకు… అర్హత..

5వ తరగతి మరియు 8వ తరగతి చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులు నవోదయ  ఎంట్రెన్స్​ పరీక్షకు అర్హులు. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి.  జనవరి ఆఖరి వరకు అడ్మిషన్లు కొనసాగిస్తారు. 120 మందికి అడ్మిషన్​ పొందే అవకాశం ఉంది.

భోజనం… వసతి:

జెనిత్​ కోచింగ్​ సెంటర్​లో చేరే విద్యార్థినీవిద్యార్థులకు ప్రత్యేక హాస్టల్​ వసతి ఉంది. మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తారు. వారంలో రెండు సార్లు గుడ్డు,  ఒకసారి చికెన్​ వంట చేస్తున్నట్లు సంస్థ డైరెక్టర్​ సతీష్​ పేర్కొన్నారు.

About Author