PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంచి పరిపాలనకు వ్యూహకర్తలు అవసరం

1 min read

– తాత సుబ్రహ్మణ్యం
పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ: ప్రస్తుత రాజకీయ పార్టీలకు అన్ని రంగాల మీద అనుభవం ఉన్న వ్యూహకర్తల అవసరం ఎంతైనా ఉందని రాజకీయ ఎన్నికల వ్యవకర్త తాత సుబ్రహ్మణ్యం అన్నారు. గాంధీనగర్ ప్రెస్క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో తాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వ్యూహకర్తల వలన పార్టీలకు ప్రజలకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆలోచనలు ఎలా ఉంటాయో, వారికి ఏమి కావాలో వాటికి అనుగుణంగా వ్యూహకర్తలు ఆలోచన చేస్తారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజధాని అనేది ఒకే చోట కేంద్రీకృతమై ఉండాలని అది ఎక్కడైనా పరవాలేదు అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

About Author