PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుడ్ నైబర్స్ నాగేశ్వర్ కు ఉత్తమ సేవా పురస్కారం

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి : గుడ్ నైబర్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కోవిడ్ 19 కష్ట కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ నాగేశ్వర్ కు ఉత్తమ సేవా పురస్కారం దక్కింది. ఆదివారం వైజాగ్ లో జరిగిన మదర్ థెరీసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరీసా కోవిడ్ వారియర్స్ అవార్డ్స్ ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడ్ నైబర్స్ ప్రాజెక్ట్ మేనేజర్ నాగేశ్వర్ తోపాటు ఇతర సభ్యులు అరకు, అనకాపల్లి ఎంపీలు కవిత, సత్యవతి, గుడివాడ ఎమ్మెల్యే అమర్నాధ్, వైజాగ్ కలెక్టర్, రైల్వే డీజీపీ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. ఈ సంధర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ తాను గుడ్ నైబర్స్ ద్వారా కోవిడ్ సమయంలో ప్రజలకు చేసిన సేవలను, సేవా కార్యక్రమాలను గుర్తించి వైజాక్ కు చెందిన మదర్ థెరీసా ఫౌండేషన్ వారు ఉత్తమ సేవా పురస్కారం అందజేయడం సంతోషదాయకమన్నారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు గుడ్ నైబర్స్ సంస్థ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు.

About Author