PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘గుడ్ నైబర్స్ ఇండియా’ సేవలు అద్వితీయం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: గుడ్ నైబర్స్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మండలం లోని యండపల్లి హెల్త్ సెంటర్ నందు పనిచేస్తున్న 20 మంది వైద్య సిబ్బంది కి డాక్టర్ సునీల్ నాయక్ చేతుల మీదుగా మాస్కులు ,శానిటైజర్స్ పంపిణీ చేసినట్లు ప్రాజెక్ట్ మేనేజర్ నాగేశ్వర్ తెలిపారు. కోవిడ్​ బాధితులకు వైద్యచికిత్సలు అందిస్తున్న నర్సులు, ఆశవర్కర్ల సేవలు అద్వితీయమని డా. సునీల్​ నాయక్​ అన్నారు. థర్డ్​ వేవ్​లో పిల్లలపై ప్రభావం ఉంటుందన్న ప్రచారం గుడ్ నైబర్స్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా పిల్లలకు మాస్కులు, శానిటైజర్స్, గ్లౌజులు అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నెబిలైజెషన్ మిషన్స్ , పల్స్​ ఆక్సామీటర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది బాబు బాలాజి తదితరులు పాల్గొన్నారు.

About Author