PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఉద్యోగుల కొత్త డీఏ విడుద‌ల‌కు ఆమోదం తెలిపింది. ఈ విష‌యాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్ చైర్మ‌న్ వెంక‌ట్రామిరెడ్డి వెల్ల‌డించారు. ప్ర‌భుత్వం గ‌తంలో విడుద‌ల చేసిన షెడ్యూల్ కు అనుగుణంగా 2022 జ‌న‌వ‌రి నుంచి ఒక డీఏను జీతానికి జ‌మ చేయ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ ప్ర‌తిపాద‌న‌కు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింద‌ని, దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు త్వ‌ర‌లో విడుద‌ల కానున్న‌ట్టు తెలిపారు.

                                         

About Author