PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో అధ్యాపకులు అందుబాటులోకి రానున్నారు. ప్రస్తుతం తక్కువమంది లెక్చరర్స్ ఉన్న కాలేజీలలో డిప్యూటేషన్‌పై అధ్యాపకులను పంపించి విద్యాబోధన చేయిస్తుంది ప్రభుత్వం. అయితే ఇకపై విద్యార్థులకు కష్టాలు తీరినట్లే.. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న లెక్చలర్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్‌ పోలా భాస్కరరావు ప్రకటనతో లెక్చరర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్‌ పోస్టుల భర్తీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ కి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్‌ పోలా భాస్కరరావు తెలిపారు.

                                          

About Author