PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: దసరా పండుగ ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా పండుగలాంటి వార్తే. పర్యటనలు/శిక్షణ/ బదిలీ/ రిటైర్మెంట్ వంటి సమయాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఎంచక్కా తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించొచ్చు. ఈ మేరకు ఆర్థిక మంతిత్వశాఖ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై తేజస్ రైళ్లలో ప్రయాణానికి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ అర్హత శతాబ్ది రైళ్లకు సమానంగా ఉంటుందని వివరించింది. తేజస్-రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు సెమీ హైస్పీడ్ రైలు. అధికారిక పర్యటనలో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ అనుమతికి సంబంధించిన అంశాన్ని సోమవారం విడుదల చేసిన ఆఫీస్ మెమొరాండంలో పేర్కొంది. 13-07-2017 నాటి డిపార్ట్‌మెంట్ ఓఎం పేరా 2 A (ii)లో పేర్కొన్న రైళ్లతో పాటు టూర్/ట్రైనింగ్/బదిలీ/రిటైర్‌మెంట్‌ సమయంలో అదనంగా తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అందులో వివరించింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ అర్హత 13.07.2017 నాటి డిపార్ట్‌మెంట్ ఓఎం పేరా 2 A (ii)లో పేర్కొన్న విధంగా శతాబ్ది రైళ్లకు సమానంగా ఉంటుందని వివరించింది.

                                

About Author