NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రూప్-1 అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఫలితాలు ప్రకటించవద్దంటూ అప్పీలుదారులు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఫలితాల ప్రకటన, పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చినట్లైతే.. అవి ప్రధాన వ్యాజ్యాలలో కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చిచెప్పింది. ఆ విషయాన్ని పోస్టింగ్‌ ఆర్డర్స్‌లో ప్రస్తావించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. అలాగే కోర్టు ఇచ్చే తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, ఉద్యోగాలకు ఎంపికైన నేపథ్యంలో భవిష్యత్తులో చట్టబద్ధమైన హక్కు కోరబోమని పోస్టింగ్‌ తీసుకున్న అభ్యర్థుల నుంచి హామీపత్రం తీసుకోవాలని పేర్కొంది. సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాలలో ప్రతివాదులుగా చేరాలంటే ఎంపికైన అభ్యర్థులు చేరవచ్చని స్పష్టం చేసింది.

                                     

About Author