PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మందుబాబుల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గ‌నున్న ధ‌ర‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో మందుబాబుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. మ‌ద్యం ప‌న్ను రేట్ల‌లో ప్ర‌భుత్వం మార్పులు చేసింది. దీంతో చాలా వ‌ర‌కు మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. ఈ మేర‌కు రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ భార్గ‌వ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. వ్యాట్, అద‌న‌పు ఎక్సైజ్ డ్యూటీ ప్ర‌త్యేక మార్జిన్ లో హేతుబ‌ద్ధ‌త తీసుకురావడం ద్వార మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది. ఇండియ‌న్ మేడ్ ఫారిన్ లిక్క‌ర్ ధ‌ర‌ల‌పై 5 నుంచి 12 శాతం, ఇత‌ర అన్ని కేట‌గిరీల మ‌ద్యం పై 20 శాతం వ‌ర‌కు పన్ను త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయి. ఇత‌ర రాష్ట్రాల నుంచి ఏపీలోకి మ‌ద్యం స‌ర‌ఫ‌రా, నాటు సారా త‌యారీని అరిక‌ట్టేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

                                 
                

About Author