PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘షిరిడిసాయిబాబా’ను దర్శించుకున్న గోపాలగౌడ

1 min read

పల్లెవెలుగు అన్నమయ్యజిల్లా రాయచోటి/వీరబల్లి: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం లో వెలిసిన షిరిడి సాయి  మందిరంలో  సుప్రీంకోర్టు మాజి న్యాయమూర్తి గోపాల గౌడ ప్రత్యేక పూజలు నిర్వహించారు వేదపండితులు రాఘవేంద్ర స్వామి  ఆయనకు వేద ఆశీర్వచనం,తీర్థ ప్రసాదాలు అందచేశారు.ఈ సందర్భంగా మాజీ న్యాయమూర్తి గోపాల్ గౌడ మాట్లాడుతూ ఇంత మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద గుడి కట్టడం ఈ ప్రాంతానికే శుభపరిణామం అన్నారు అనంతరం ఆలయ చైర్మన్ రామకృష్ణమ రాజు, విఆర్డీఎస్ సురేంద్రారెడ్డి కలసి సుప్రీంకోర్టు మాజిన్యాయమూర్తి గోపాల్ గౌడ,టీడీపీ జిల్లా నాయకులు జగన్మోహన్ రాజు, రైతు సంఘము నాయకుడు మదన్ మోహన్ రెడ్డి, వెంకటేశ్వర భక్తి చానెల్ డైరెక్టర్ ను శాలువా పూలమాలతో గణంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు భాను గోపాల్ రాజు,  తుమ్మల రమేష్, సుధాకర్,నేతిరమేష్, గుదే నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

About Author