PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంచి నాయకుడి చేతిలో పాలన ఉండాలి: టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంచి నాయ‌కుడి చేతిలో పాల‌న ఉంటేనే ప్ర‌జ‌లు సంతోషంగా ఉంటారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టి.జి భరత్ అన్నారు. న‌గ‌రంలోని 12వ వార్డుకు చెందిన వైసీపీ నాయకుడు అబ్దుల్లా త‌న బృందంతో క‌లిసి వైసీపీని వీడి టిజి భరత్ స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. క‌ర్నూల్లో తనను ఎమ్మెల్యే చేస్తే ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని చెప్పారు. పార్టీలో చేరి యువకులు మంచి నిర్ణయం తీసుకున్నారని భరత్ చెప్పారు. రాష్ట్రంలో పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. టిడిపిని గెలిపిస్తే ధరల నియంత్రణకై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలులో పదేళ్ల పాలన ఎలా ఉందో అందరూ చూసారని.. వచ్చే ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇస్తే తాను ప్రజలకు ఎంత సేవ చేస్తానో చూస్తారన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. మాయమాటలు చెప్పే వారిని నమ్మకుండా కర్నూలు ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే తనను గెలిపించాలని కోరారు. కర్నూలు అభివృద్ధి కోసం తన వద్ద ప్రణాళిక ఉందని చెప్పారు. అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంఛార్జీ ఈశ్వర్, వార్డ్ ఇంఛార్జీ చిన్నమ్మ, టిడిపి సీనియర్ నేతలు మన్సూర్ ఆలీఖాన్, మెహబూబ్ ఖాన్, తిరుపాల్ బాబు, పెంచలయ్య, వార్డు నాయకులు రఫీ, బాబు, రసూల్, అరుణ, ఆనంద్, చంద్రశేఖర్, బాలసాయి, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.

About Author