PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

21న ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

1 min read

– ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు అక్టోబర్ 21న పూర్వ విద్యార్థుల సమ్మేళనం  నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రిన్సిపాల్ డా.సునీత, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి తెలిపారు.గురువారం నందికొట్కూరు పట్టణంలో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. సునీత అధ్యక్షతన  కళాశాల అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ  గత 25 సంవత్సరాల కాలంలో  కళాశాలలో డిగ్రీ చదివిన   ప్రతి పూర్వపు విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ  కళాశాలలో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు  వివిధ ఉన్నతస్థాయి పదవులలోను, ఉన్నత స్థాయి అధికారులుగా స్థిరపడ్డారని తెలిపారు. పూర్వపు విద్యార్థులను అందరిని ఒకే వేదికపై తీసుకొస్తామని చైర్మన్ తెలిపారు. పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో స్థలదాత జువ్వాజి సుంకన్న విగ్రహాన్ని ఆవిష్కరించాలని భవించామన్నారు. ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా 2024 జనవరి 9 న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పూర్వపు విద్యార్థుల సంఘం నాయకులు హరిసర్వోత్తమ రెడ్డి, బద్ధుల శ్రీకాంత్ , చిట్టిబాబు, కళాశాల  తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఎం అన్వర్ హుస్సేన్, హిందీ అధ్యాపకులు  కాజా హుస్సేన్ , కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఆసిఫ్ భాష ఇతర అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

About Author