PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మసీదులో సందేశం ఇచ్చాక… ప్రభుత్వ ఖాజీ మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఖాజీ సయ్యద్​ షా ఖా బాషా ఖాద్రి (65) శుక్రవారం మృతి చెందారు. గుంతకల్లు మసీదులలో సందేశం ఇచ్చిన తరువాత.. మెట్లు దిగేటప్పుడు కిందకు పడిపోవడంతో అక్కడికక్కడే ఊపిరివదిలారు. కి శే సయ్యద్ షా లతీఫ్ బాషా ఖాద్రి లోబాలి కుమారుడైన సయ్యద్​ షా ఖా బాషా ఖాద్రి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయలుగా రిటైర్డు అయ్యారు.

ఆ తరువాత చిప్పగిరి దర్గాకు పీఠాధిపతిగా ఉన్నారు. గుంతకల్లు ప్రభుత్వ ఖాజీగా ముస్లిం సోదరులకు మసీదులో ప్రార్థన చేయించిన తరువాత మెట్లు దిగుతుండగా కింద పడిపోయాడు. ప్రభుత్వ ఖాజీ సయ్యద్​ షా ఖా బాషా ఖాద్రి మృతి చెందడంతో గుంతకల్లు ముస్లిం సోదరులలో విషాదం నెలకొంది. ఆయన అంత్యక్రియలు శనివారం చిప్పగిరిలో చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

About Author