PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కదిరిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు దారుణ హత్య

1 min read


పల్లెవెలుగు వెబ్: అనంతపురం జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ప్రభుత్వ టీచర్ ఉషారాణి ఇంట్లో దోపిడికి వెళ్లిన దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి, ఆపై ఆమె మెడలోని నగలతో పరారయ్యారు. ఈ ఘటన కదిరి పట్టణంలో చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేపింది. టీచర్ ఇంట్లో దొంగతనానికి ముందు పక్కన ఉన్న మరో ఇంట్లోకి చొరబడి శివమ్మ అనే మహిళను తీవ్రంగా గాయపర్చారు. శివమ్మ ఇంట్లో పనిచేసే పనిమనిషి వచ్చిన తరువాతనే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రస్తుతం శివమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

About Author