NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని కలిసిన ప్రభుత్వ ఖాజీ

1 min read

పల్లెవెలుగు , వెబ్​ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు ప్రభుత్వ ఖాజీ ఇబ్రాహీం రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. నందికొట్కూరు పట్టణంలోని మక్కా మజీద్‌ మౌలానా మహమ్మద్ ఇబ్రహీం ను వైసీపి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శాప్‌ చైర్మన్‌ బైరెడ్డిసిద్దార్థరెడ్డి ఆశీస్సులతో ప్రభుత్వ ఖాజీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడ నగరంలోని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గృహంలో వైసిపి నాయకులు ఆర్టీసీ బాబు మరియు ఇబ్రాహీం లు మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సిద్దార్థ రెడ్డి ని దుషాలువలతో సత్కరించి సంతోషాన్ని అభిమానాన్ని చాటుకోన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులూ సలామ్ బాషా, విద్యా కమిటీ చైర్మన్ చరణ్ తేజ, రఫీ, మార్క్ రెస్టారెంట్ ప్రొప్రైటర్ సాలిక్,ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ డ్రైవర్ అసోసియేషన్స్ నాయకులు ధనుంజయ నాయుడు ,తదితరులు పాల్గొన్నారు.

About Author