PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి పనులపై గ్రామ సభలు నిర్వహించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, రుద్రవరం: ఉపాధి పనులపై గ్రామాలలో గ్రామసభలు నిర్వహించాలని ఎంపీడీవో మధుసూదనరెడ్డి ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన ఉపాధి పనులపై క్షేత్ర సహాయకులు సాంకేతిక సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా లేబర్ బడ్జెట్ అలాగే పనుల ప్రణాళికలపై సిబ్బందికి వివరించారు. పూర్తి ప్రణాళికాబద్ధంగా గ్రామసభలు నిర్వహించాలన్నారు ఇందుకు సంబంధించిన గ్రామాల వారీగా షెడ్యూల్ తయారు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఓ ప్రతాప్ ఈసీ సుబ్బన్న ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

About Author