PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో స్వాతంత్ర్య పోరాట సమరయోధులు వడ్డే ఓబన్న 217 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.గురువారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా కేంద్రంలోని సూరాజ్ హోటల్ లో జరిగిన వడ్డే ఓబన్న జయంతి వేడుకలకు వడ్డెర సంఘం జిల్లా మరియు రాష్ట్ర నాయకులు వడ్డెర సంఘం కార్పొరేషన్ నాయకులు హాజరయ్యారు.మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామానికి చెందిన వడ్డె సంఘం నాయకులు ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి పరిశీలకులు దేవర్ల మురళి మరియు నంద్యాల జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు చక్రి మరియు నాయకులు ఓబన్న చిత్రం పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో దండగల కృష్ణ, దేవమాడ ఎల్ల నాగన్న,శ్రీరాములు,జరపటి రామాంజనేయులు,మధు, రామకృష్ణ,హేమంత్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author