PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు:  శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో టిడిపి రాష్ట్ర నాయకులు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్ కార్యాలయం వద్ద 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజల స్వచ్ఛందంగా భారీ ఎత్తున హాజరై జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత జరిగిన సమావేశంలో స్వాతంత్రం కోసం అప్పుడు ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించి దేశాన్ని కాపాడుకున్నారని గుర్తు చేస్తూ, మరల మన రాష్ట్రానికి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ పార్టీ దుష్ట పాలనను చరమగీతం పాడాలని అహ్మద్ హుసేన్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము కానీ నాలుగు సంవత్సరాలుగా  రాష్ట్రం అంధకారంలో నేలకొందని, మరలా నిజమైన స్వాతంత్రం రావాలంటే వైసీపీ పార్టీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ జాబివల్ల,టిడిపి యువ నాయకుడు మోమిన్ ముస్తఫా, కౌన్సిలర్ ముఫ్తి నూర్ మొహమ్మద్, రాజమాత్ శంశూర్,మనోహర్,గౌస్ మాలిక్,ఇక్బాల్,పోలీస్ కలిం,ఫ్రూట్ రఫీక్,ఖాజా,నబిసా, సలాం,జకీర్,నూరి, ఖలీలుల్ల తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author