PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా రథ సప్తమి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు రథసప్తమి పురస్కరించుకొని పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు సూర్య భ గవానునికి రథసప్తమి పూజలు నిర్వహించారు. ఉదయం సూర్యస్పటికమునకు అభిషేకం నిర్వహించి అనంతరం సూర్యనారాయణ స్వామి మూలవిరాట్కు క్షీరాభిషేకం అర్చనా నిర్వహించడం జరిగినది. ఇందులో ఎమ్మెల్యే గౌరవనీయులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు శ్రీదేవి గారు పాల్గొనటం మరియు ఎస్ వి మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగినది.

About Author