PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలలో మరియు వివిధ గ్రామ పంచాయతీలలో అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ, ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సిరాజుద్దీన్,వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి ఎం.పిరు నాయక్, మండల రిసోర్స్ భవనం దగ్గర ఎంఈఓ పీ.మౌలాలి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ నాయక్,ఏపీ మోడల్ పాఠశాల,మహిళా మండల సమాఖ్య పొదుపు భవనంలో ఏపీఎం సుబ్బయ్య,జిల్లా పరిషత్ పాఠశాల మరియు తదితర కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగురవేశారు.అంతేకాకుండా మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామాల సర్పంచులు మిడుతూరు జయలక్ష్మమ్మ,తిమ్మాపురం నాగస్వామి రెడ్డి,చౌటుకూరు మదర్ సాహెబ్,నాగలూటి ఉషారాణి, పైపాలెం మర్రి రామచంద్రుడు,మాసపేట శంసున్ బి,కడుమూరు జీవరత్నం,తలముడిపి వెంకటేశ్వర్లు తదితర గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ జెండాను ఎగురవేశారు.అంతేకాకుండా వివిధ పాఠశాలల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి ప్రక్రుద్దీన్,ఏవో దశరథ రామయ్య,ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author