PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో మదరసా ఏ నూరుల్ హుస్సేన్ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ అ మహానీయులు చేసిన త్యాగాలు మరువలేనివి చేరపలేనివి ఎస్సార్ బీస్ మౌలానా మాట్లాడుతూ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నాయి.భారతదేశ చరిత్రలో గణతంత్ర దినోత్సవం అతిముఖ్యమైన ఘట్టం. 1949 నవంబర్ 26న రాజ్యంగ సభ భారత రాజ్యంగాన్ని ఆమోదించింది.ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజునే గణతంత్ర దినోత్సవం అంటాం.రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. దీంతో దేశానికి స్వాతంత్ర్యం పూర్తిగా లభించింది అన్నారు. ఈ కార్యక్రమంలో సాహిద్దిళ్ల మౌలానా మబ్బులు మౌలానా సైదు బై 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author