PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:   K P R మైత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలొ పత్తికొండ మండలం  జీవరాల్ల మాన్ తాండ  పాఠశాలలో బుధవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న  ఉత్తమ ఉపాధ్యాయురాలు కళ్యాణి కుమారిని సత్కరించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలు వేసి వైయస్సార్సీ,పీ నాయకులు మాజీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎస్ రామచంద్రారెడ్డి K P R మైత్రి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రామ్మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఉత్తమ ఉపాధ్యాయురాలు కళ్యాణి కుమారికి పూలమాలలువలతో సన్మానించారు. అలాగే స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామచంద్ర రెడ్డి గ మాట్లాడుతూ, ఉత్తమ ఉపాధ్యాయురాలుగా కళ్యాణి  ఎన్నో అవార్డులు అందుకోవడం గర్వకారణమని ఎంతోమందికి ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయురాలు క్రమశిక్షణతో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారని, విద్యార్థులు శ్రద్ధతో క్రమశిక్షణతో బాగా చదివి, ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోసూరు రాజేషు ఖాజా హుస్సేన్ లింగన్న ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author