PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

35 మంది మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు

1 min read

– చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇస్లాంపేట విద్యార్థిని విద్యార్థులకు
పల్లెవెలుగు వెబ్​ ,ఆత్మకూరు: శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఇస్లాంపేట లోని చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో 35 మంది విద్యార్థినీ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ మంజూరు చేయడం జరిగిందని శ్రీ రామ్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ హిదయతుల్లా తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా సంస్థ మోటార్ ఫీల్డ్ కు సంబంధించిన తల్లిదండ్రుల పిల్లలకు ఎనిమిదో తరగతి నుండి ఆపై ఉన్నత చదువులు చదివేవారికి మెరిట్ స్కాలర్ షిప్ కింద తగిన పారితోషకం ఇచ్చి వారి చదువుకు తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. ఆత్మకూరు మండలం లోనే దాదాపు 9 లక్షల రూపాయలు మా సంస్థ తరఫున మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ తాజుద్దీన్ తో పాటు ఉపాధ్యాయులు మరియు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ షేక్షావలి పాల్గొన్నారు.

About Author