PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

100 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు మంజూరు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణం లోని 7,15,16,19 వార్డ్ ల ప్రజల లో వోల్టెజ్ కరెంటు కష్టాలకు ఇక చెల్లు చీటీ ఆత్మకూరు పట్టణంలోని కొన్ని వార్డులలో లో – వోల్టేజ్ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు ఉండడంతో గత కొన్ని సంవత్సరాలుగా పట్టణ ప్రజలు ఆయా వార్డులలో ఇబ్బందులు పడడం సర్వసాధారణమైన సందర్భంలో.. ఆయా వార్డుల కౌన్సిలర్లు నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారి దృష్టికి లో వోల్టేజి సమస్యను అధిగమించడం కోసం 100 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసి ఇబ్బందులు తొలగించేలా సహకరించాలని కోరగా….వెనువెంటనే స్పందించిన ఎమ్మెల్యే శిల్పా.. కరెంటు ఏ ఈ గారికి ఆదేశాలు జారీ చేయడంతో…విద్యుత్ కాంట్రాక్టర్ కౌన్సిల్లర్ సుల్తాన్ తో సమన్వయం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆయా వార్డులలో నూతన 100 కే.వి ట్రాన్స్ఫార్మర్లను బిగించడం జరిగింది.ఈ సందర్భంగా కాలనీవాసులు ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యను తన దృష్టికి రాగానే పరిష్కరించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారికి, తమ తమ వార్డుల కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.

About Author