NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్టర్ బిషప్ జయరావు పొలిమేర కు ఘన సత్కారం..

1 min read

దేశ ప్రజలందరూ శాంతి సమాధానధాలతో జీవించాలి..

బిషప్ జయరావు పొలిమేర

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  స్థానిక 3వ డివిజన్ నవాబ్ పేట కాలనీ విచ్చేసిన ఏలూరు కతోలిక పీఠాధిపతులు డాక్టర్ బిషప్ పొలిమేర జయరావు చే,బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు మత్తే బాబి అధ్యక్షతన గణతంత్ర దినోత్సవం సందర్బంగా ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు వేయించి అనంతరం ఆయనకు బహుజన సేన (రేపటి తరం కోసం) టీమ్ ఆధ్వర్యంలో గజమాల వేసి శాలువతో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్బంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, ప్రజలందరూ శాంతి, సమాధానాలతో జీవించాలని పిలుపునిచ్చారు, కార్యక్రమ నిర్వాహకులైన బహుజన సేన టీమ్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఫాదర్ ఇంజమాల మైకేల్, బహుజన సేన రాష్ట్ర కోశాధికారి మత్తే కుమార్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డోలా శాంతి,రాష్ట్ర ఉపాధ్యక్షులు ముప్పన రాజులు, ఏలూరు నగర అధ్యక్షులు ఏలేటి మనోజ్, కోలా మణి, ఏలూరు నగర సభ్యులు కొత్తలంక నవీన్ కుమార్,గోక పోలినాయుడు, బెనర్జీ, తదితరులు పాల్గొన్నారు.

About Author