PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ ఉపాధ్యాయులకు ఎస్టీయు అధ్వర్యంలో ఘన సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ:  స్థానిక బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో నేడు ఎస్టీయు ప్యాపిలి మండల శాఖ ఆధ్వర్యంలో చంద్రమౌళి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నంద్యాల జిల్లా ఉత్తమ  ప్రధానోపాధ్యాయులు గా  ఇటీవల అవార్డు పొందిన  డోన్ ఎన్.ఎన్. కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.సురేష్ బాబుకు మరియు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా  అవార్డు పొందిన యం .శ్రీనివాసులు (భౌతిక శాస్త్రం)పి.ఆర్.పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన ఉపాధ్యాయుడికి, రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్. టి.యు ప్యాపిలి మండల శాఖ బృందంశాలువా,జ్ఞాపిక,పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ సమావేశంలో ఎస్టీయు నంద్యాల జిల్లా అధ్యక్షులు అజాం బేగ్,ఉపాధ్యక్షులు వెంకట్ నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజులు నంద్యాల జిల్లా సి. పీ.యస్ కన్వీనర్ చిన్నప రెడ్డి, సీనియర్ నాయకులు మౌలాలి మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం యస్ టి యు సభ్యులు ఎల్లప్పుడూ వృత్తికి న్యాయం చేస్తూ..అంకిత భావంతో పనిచేస్తారనీ విద్యా రంగ అభివృద్ధికి కృషి చేస్తారనీ  తెలిపారు. సురేష్ బాబు మరియు శ్రీనివాసులు ఇరువురికీ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం తమకెంతో సంతోషాన్ని కలిగించింది అనీ యస్ టి యు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.అవార్డు రావడం మరింత బాధ్యతను పెంచిందని అవార్డు గ్రహీతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యస్ టి యు నాయకులుఅజామ్ బేగ్  వెంకట్ నాయక్, నాగరాజు,చంద్రమౌళి,చిన్నపరెడ్డి,రాంప్రసాద్,వెంకటేశ్వర్లు, శేఖర్,రామాంజనేయులు,మధుసూధన్, మద్దిలేటి, నందప్ప, నాగన్న,నాగేశ్వర నాయక్,పుల్లయ్య, నాగ మల్లేష్,మనోహర్,శివ, శేష నాయక్, విజయ్ కుమార్ రెడ్డి, మల్లేష్, సుశీల,జీవిత,ప్రియాంక, పీ.అర్. పల్లి గ్రామ పెద్దలు మర్రెడ్డి,కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author