PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంఘీభావ పాదయాత్రకు విశేష స్పందన

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు   అడుగడుగునా ఎదురవుతున్న ఆటంకాలను అదిగమిస్తూ సాగుతున్న యువగలానికి 200 రోజులు  పూర్తిగా చేసుకున్న  సందర్భంగామాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి టిడిపి నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు గార్ల ఆద్వర్యంలో చేపట్టిన సంఘీ భావ పాదయాత్ర కు విశేష స్పందన లభించింది తెలుగుదేశం పార్టీ నాయకులు,.గాలివీడు లో అడుగడుగునా వేలాది మంది  కార్యకర్తలు, పార్టీ అభిమానులు,  అశేష జనవాహిని నడుమ  యువగళం సంఘీభావ పాదయాత్ర..సాగించి.గాలివీడు మండలంలోని పక్కి రెడ్డి గారి పల్లె గాలివీటమ్మ ఆలయం వద్ద నుండి బస్టాండ్, నాలుగు రోడ్ల కూడలి మీదుగా ఆర్ ఆర్ జూనియర్ కాలేజీ వరకు సాగిన సంఘీభావ పాదయాత్ర..మా భరోసా మీపైనే అంటూ  పాదయాత్రగా కదిలిన నాయకులకు మంగళ హారతులు  రాఖిలు కట్టిన  తెలుగింటి ఆడపడుచులు  పట్టారు..బస్టాండ్ లోని పూల అంగల్ల వద్ద స్వర్గీయ నందమూరి తారకరామారావు  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు..పసుపు మాయంగా మారిన గాలివీడు పుర వీధులు… దారిపోడవునా నాయకులకు నిరాజనాల పలికిన కార్యకర్తలు, టిడిపి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author