PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన….

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా కురవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కర్నూల్ ఎంపీపీ హాల్ నందు జరిగిన వివాహ పరిచయ వేదిక కార్యక్రమం విశేష స్పందనతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమము ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ఉపాధ్యక్షులు కత్తి శంకర్ మాట్లాడుతూ కురవ కులస్తులు వివాహ సమయంలో సాంప్రదాయాలు కట్టుబాట్లు విషయంపై సుదీర్ఘంగా ప్రసంగించారు . కురువ కులస్థులు ఐక్యంగా ఉండాలని ఆర్థికంగా ఎదగాలని రాజకీయంగా ఎదగాలని పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ జిల్లాల నుంచి వివాహ సంబంధాల కోసం అత్యధికంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమం గత 2003 నుంచి కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం రామకృష్ణ గౌరవ అధ్యక్షులు కిష్టన్న ఆర్ అండ్ బి డిఇ వెంకటేశ్వర్లు కేసీ నాగన్న కర్నూల్ దేవేంద్ర పాల సుంకన్న ధనుంజయ రామకృష్ణ బి ఎన్ టాకీస్ వెంకటేష్  దివాకర్ తిరుపాల్ మద్దిలేటి ఎస్ నాగన్న తదితరులు పాల్గొన్నారు.

About Author