NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెను విషాధం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉత్త‌రాఖండ్ లోని చార్‌ధామ్‌ యాత్రలో పెను విషాదం నెలకొంది. భక్తులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు వాగులో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో కనీసం 28 మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లా దమ్‌తా సమీపంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా నుంచి భక్తులను ఎక్కించుకొని ఈ బస్సు యమునోత్రికి బయలుదేరింది. ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌కు ఫోన్‌చేసి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక బృందాలతో పాటు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో దిగాయని, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించాయని అమిత్‌ షాకు పుష్కర్‌ సింగ్‌ వివరించారు.

                                       

About Author