NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో వ‌జ్రాల వేట‌కు గ్రీన్ సిగ్నల్ !

1 min read

పల్లెవెలుగు వెబ్ ​:ఆంధ్రప్రదేశ్ లోని క‌డ‌ప జిల్లాలో వ‌జ్రాల వేట‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉప్పరపల్లెలో వజ్రాల అన్వేషణకు మైనింగ్‌ శాఖ త్వరలో టెండర్లు పిలవనుంది. ఉప్పరపల్లె ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్లు ఇటీవల జియోగ్రాఫికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) ధృవీకరించి, ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రాథమిక సర్వే (జీ–4) ప్రకారం వజ్రాల లభ్యత ఉన్నట్లు తేలింది. గతంలో జీ–4 సర్వే ఆధారంగా గనుల వేలం నిర్వహించకూడదని కేంద్రం స్పష్టం చేయడంతో వజ్రాల గనిపై ముందడుగు పడలేదు. ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో కేంద్రం ఇటీవలే తాజాగా ఎంఎండీఆర్‌ చట్టాన్ని సవరించి జీ–4 సర్వే ప్రకారం గనుల్ని లీజుకిచ్చే అవకాశం కల్పించింది. దీంతో ఉప్పరపల్లి లో వజ్రాల గనికి సానుకూలత ఏర్పడింది.

About Author