PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా కలెక్టర్ కు అధికారులకు శుభాకాంక్షలు వెల్లువ

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: 2024 నూతన సంవత్సర సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ను మిడుతూరు ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈఓఆర్డి డి. ఫక్రుద్దీన్,కార్యాలయ పరిపాలన అధికారి ఏ.సురేష్ కుమార్,సీనియర్ అసిస్టెంట్ జి. సురేష్ కుమార్ లు కలసి నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు పూల బోకే మరియు స్వీట్ ను కలెక్టర్ కు అందజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా మిడుతూరు తహసిల్దార్ ఎస్.ప్రకాష్ బాబుకు కర్నూలులోని ఆయన స్వగృహంలో రెవెన్యూ సిబ్బంది  డిప్యూటీ తహసిల్దార్ షాన్ వాజ్,సీనియర్ అసిస్టెంట్ రాంభూపాల్ రెడ్డి,ఆర్ఐ భాష పూల బోకేలతో పూల మాలలతో తహసిల్దార్ దంపతులను సన్మానిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీట్లను ఒకరి నొకరు పంచుకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వీఆర్వోలు వెంకటయ్య, రాఘవేంద్ర,ఆంజనేయులు, షఫీ మరియు అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.

About Author