PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీవైసీపీ అధినేత వైఎస్​ షర్మిలకు శుభాకాంక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, హైదరాబాద్​: తెలంగాణా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ షర్మిలను , కొండా రాఘవ రెడ్డిని వైఎసీపీ 24వ ఫౌండేషన్​ రాయలసీమ సమన్వయకర్త మాదరాపు కేదార్నాథ్​ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ 24 ఫౌండేషన్ యొక్క కార్యాచరణ మరియు ప్రణాళిక గురించి తెలంగాణ లోని ఫౌండేషన్ కు సంబంధించిన రూపకల్పన గురించి తెలియజేశామని మాదరాపు కేదర్నాథ్​ తెలిపారు. కేదర్నాథ్​ వెంట.. వైఎస్సార్ 24 ఫౌండేషన్ చైర్మన్ జగన్ పండిత్, ప్రకాశం జిల్లా ఇంచార్జీ రంగ వర్ధన్ రెడ్డి, ఆది శేషు, జేశ్వంత్, వసంత్ తదితరులు ఉన్నారు.

About Author