NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మొక్కలు పెంచండి.. కాలుష్యాన్ని నివారించండి

1 min read
  • వైసిపి కన్వీనర్ గాలివీటి రాజేంద్రనాధ్ రెడ్డి
    పల్లెవెలుగు రాయచోటి /వీరబల్లి: ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు పెంచి కాలుష్యాన్ని నివారించాలని వై సి పి మండల కన్వీనర్ గాలివీటి రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని సానిపాయ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ నేతి ఆంజనేయులు ఆధ్వర్యంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రనాథ్​రెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం ప్రతిఒక్కరూ గమనించి గ్రామ అభివృద్ధి కి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది మరియు వైఎస్సార్ సీపీ నాయకులు సానిపాయ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆంజనేయులు గారు మరియు వాలెంటీర్ లు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author