NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెరుగుతున్న క‌రోన కేసులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వారం రోజులుగా బెంగళూరు కేంద్రంగానే క‌రోన కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే కేసులలో 90శాతానికిపైగా బెంగళూరులోనే ఉంటున్నాయి. ఇది వరకు 1.1శాతంగా పాజిటివిటీ రేటు ఉండగా తాజాగా 2.15శాతం దాటింది. ఆదివారం విడుదలైన బులెటిన్‌ ప్రకారం బెంగళూరులో 429 కేసులు నమో దయ్యాయి. అన్ని వార్డులలోనూ కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. మహదేవపుర, బొమ్మనహళ్ళి డివిజన్‌లోనే ఎక్కువమంది బాధితులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇతర వార్డులతోపోలిస్తే బెళ్ళందూరు, వర్తూరు, హగదూరులలో జనాభా అధికంగా ఉండగా ఇక్కడ ఎక్కువ కొవిడ్‌ కేసులు నమోదైనట్టు బీబీఎంపీ అధికారులు వెల్లడించారు.

                                      

About Author