PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంతిమ‌యాత్రకూ జీఎస్టీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మనిషి అంతిమయాత్ర కోసం కూడా జీఎస్టీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి అన్నారు. దేశంలో ధరల పెరుగుదలపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వ్యవసాయంపై సెస్‌ విధిస్తున్న కేంద్రప్రభుత్వం ఆ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశం అమృత కాలంలోకి ప్రవేశిస్తోందని బీజేపీ చెప్తున్న ఈ తరుణంలోనూ ప్రజలు పేదరికంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతో ఉందని, కేంద్రం మాత్రం తెలంగాణకు రావాల్సిన రుణాల్లో కోత విధించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

                                  

About Author